భూసార పరీక్ష విధానం

భూసార పరీక్ష విధానం

Alt Text

KAP Associates వారు అందిస్తున్న , అధిక పోషక విలువలు కల్గిన కార్బన్ సేంద్రియ ఎరువు (KAP N-Riched Bio Manure) ఇప్పుడు, రైతులకు అందుబాటు ధరలో దొరుకుతుంది. పూర్తి వివరాలకు, bulk orders కోసం సంప్రదించండి : శ్రీనివాస్ – 9959171939 .

Alt Text

Monday, March 14, 2022
www.kapassociates.in | @kapassociatesofficial

Phone: 9959171939 | +91 40 40025505
[email protected]

Alt Text

భూమి యొక్క సారాన్ని పరీక్షించి తెలుసుకొనే పద్ధతిని భూసార పరీక్ష అంటారు. భూమి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తూ మొక్క పెరుగుదలకు, దిగుబడిని అందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవటం ఎంతో అవసరం. తద్వారా ఎరువుల వాడకంలో అనవసరపు ఖర్చులు చేయకుండా, భూసారాన్ని కాపాడుకుంటూ, అధిక మరియు సుస్థిర దిగుబడులను పొందవచ్చు. దీనికి సంబంధించి రైతులు తమ పొలంలోని మట్టిని 2 సం||లకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. పోషక పదార్ధాల గురించేకాక, భూమిలోని చౌడు గుణాలను, సున్నం శాతాన్ని, నేల కాలుష్యాన్ని గుర్తించేందుకు కూడ మట్టి పరీక్ష చేయించుకోవాలి.

భూసార పరీక్షలో అన్నింటి కన్నా ముందు తెలుసుకోవాల్సిన విషయం మట్టి నమూనాను సేకరించడం. భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరియైనది కానిచో, దాని భౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండదు. దీని వలన చేయించిన భూసార పరీక్ష, దానికి అనుగుణంగా చేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్థమవుతాయి. అంతేకాక, ఒక్కొక్కసారి తప్పుడు సిఫార్సులు కూడ చేయడం జరుగుతుంది.

మట్టి నమూనా సేకరణ విధానం

Alt Text

పొలంలో  ‘V’  ఆకారంలో 15 సెం.మీ. వరకు పారతో గుంట తీసి, అందులో పైపొర నుంచి క్రింద వరకు ఒక ప్రక్కగా మట్టిని సేకరించాలి. ఈ విధంగా ఎకరా విస్తీర్ణంలో 8-10 చోట్ల సేకరించిన మట్టిని ఒక దగ్గర చేర్చి, బాగా కలిపి 4 భాగాలుగా చేయాలి. అందులో ఎదుటి భాగాలు తీసుకుని, మిగతా భాగాలు తీసివేయాలి. ఈవిధంగా మట్టి 1/2 కిలో వచ్చే వరకు చేయాలి. ఇలా సేకరించిన మట్టిలో రాళ్లు, పంట వేర్ల మొదళ్ళు లేనట్లుగా చూసుకుని, నీడలో ఆరనివ్వాలి. మట్టి నమూనా సేకరణకు రసాయనిక/సేంద్రియ ఎరువుల సంచులను వాడరాదు. మట్టి నమూనా కొరకు పొలంలో మట్టిని త్రవ్వి, సేకరించినపుడు

  • గట్ల దగ్గరలోను మరియు పంట కాల్వలలోను మట్టిని తీసుకోరాదు.
  • చెట్ల క్రిందనున్న పొలం భాగం నుంచి మట్టిని సేకరించరాదు.
  • ఎరువు (పశువుల పేడ, కంపోస్టు, వర్మి కంపోస్టు, పచ్చిరొట్ట మొదలగునవి) కుప్పలు వేసి ఉంచిన చోట మట్టిని సేకరించరాదు.
  • ఎప్పుడూ నీరు నిలబడే పల్లపు స్థలంలో మట్టిని సేకరించరాదు.

పొలంలో వాలు ఎక్కువగా ఉన్నప్పుడు, దానిని ఎత్తు, పల్లపు ప్రాంతాలుగా విభజించి వేరు వేరుగా మట్టి నమూనాలను సేకరించాలి. అటువంటి సందర్భాల్లో కూడ, పైన తెలిపిన జాగ్రత్తలు పాటించాలి. పొలంలో అక్కడక్కడ చౌడు ప్రాంతంగా ఉన్నట్లు అనుమానం కలిగితే అక్కడి నుంచి ప్రత్యేకంగా నమూనాను తీసి వేరుగా చౌడు లక్షణాల పరీక్ష కొరకు పంపాలి. అంతేగాని, అటువంటి మట్టిని బాగుగా ఉన్న ఇతర ప్రాంతపు మట్టితో కలుపరాదు.

సేంద్రియ కర్బనము :
ఇది సాధారణముగా 0-0.5 కన్నా తక్కువగా లేక 1.0 శాతం వరకు ఉంటుంది. రాష్ట్రంలో అన్ని నేలలు ఇటువంటి పరిస్ధితి కల్గి ఉన్నందున రైతాంగము తప్పని సరిగా తమ పంటలకు సేంద్రియ ఎరువులను (పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, కంపోస్టు, వర్మి కంపోస్టు, పచ్చిరొట్ట, చెక్క పిండి మొదలగునవి) ధారాళముగా క్రమం తప్పకుండా వాడాలి.

లభ్య నత్రజని :
ఇది పరీక్ష కావింపబడిన మట్టి నమూనాలలో ఎకరాకి 112 కిలోలు కన్నా తక్కువగా ఉన్నప్పుడు పంటలో సిఫారసు మోతాదు యూరియా కన్నా 25 నుండి 30 శాతం అధికంగా వాడాలి. ఈ లభ్య నత్రజని ఎకరాకి 112 నుండి 224 కిలోలు ఉన్నప్పుడు, సిఫారసు యూరియాను మాత్రమే వాడాలి. అన్ని పరిస్ధితులలోను సిఫారసు మొత్తం నత్రజనిని పంటకాలంలో 3 నుండి 4 దఫాలుగా వాడాలి.

లభ్య భాస్వరము :
మట్టి నమూనా పరీక్షలో దీని విలువ ఎకరాకి 10 కిలోల వరకు ఉన్నప్పుడు సిఫారసు చేసిన భాస్వరము మోతాదును 25 నుండి 35 శాతం పెంచి వాడాలి. లభ్య భాస్వరము ఎకరాకి 24 కిలోల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు సిఫారసు చేసిన మోతాదులో 25 నుండి 30 శాతం భాస్వరము ఎరువును తగ్గించి వాడాలి. ఎకరానికి 11 నుండి 24 కిలోల లభ్య భాస్వరము ఉన్న నేలల్లో సిఫారసు చేసిన ఎరువు మోతాదునే వాడాలి. అన్ని సందర్భాల్లోను సిఫారసు చేసిన భాస్వరము ఆఖరి దుక్కిలో మాత్రమే వేయాలి. పై పాటుగా భాస్వరము ఎరువులను వాడరాదు.

లభ్య పొటాషియం :
మట్టి నమూనా పరీక్షలలో దీని విలువ ఎకరాకి 58 కిలోల కన్నా తక్కువగా ఉండే సిఫారసు చేసిన పొటాష్ ఎరువు కన్నా 25 నుంచి 30 శాతం ఎక్కువగా వాడాలి. అదే విధముగా లభ్య పొటాషియం ఎకరాకి 136 కిలోల కన్నా ఎక్కువగా ఉంటే సిఫారసు మోతాదులో 25 నుండి 30 శాతం తక్కువ వేసి వాడాలి. అదే 58 నుండి 136 కిలోల లభ్య పొటాషియం ఎకరానికి ఉండే సిఫారసు చేసిన మోతాదును మాత్రమే వాడాలి.

లభ్య గంధకము :
మట్టి పరీక్ష సారాంశ పత్రములో దీని విలువ 10 మి.గ్రా/గ్రా లేక తక్కువ లేక లోపం అని సూచించినప్పుడు పంటకు సిఫారసు చేసిన జిప్సమ్ను ఆఖరి దుక్కిలో వేసి పంటకు అందించాలి.

లభ్య సూక్ష్మపోషకాలు :
సాధారణముగా జింకు మరియు బోరాన్ లోపాలు మట్టి నమూనా విశ్లేషణ పత్రంలో ప్రాముఖ్యమైన సూక్షపోషకాలు. జింకు మోతాదు మట్టిలో 0.6 మి.గ్రా/గ్రా మరియ బోరాన్ 0.52 మి.గ్రా/గ్రా కాని అంతకన్నా తక్కువగా కాని ఉన్నప్పుడు లేక సంబంధిత పోషకాన్ని తక్కువ లోపం అని పేర్కొన్నప్పుడు సిఫారసు చేసిన సంబంధిత ఎరువులను వాడాలి.

About KAP Bio Manure

KAP Associates, which specializes in marketing food, commodity and agro-based products,

Offers their product KAP N-Riched Bio Manure (organic fertilizer) with the highest quality standards, at a lower price than any other organic fertilizer currently available in the market.
KAP N-Riched Bio Manure is designed to re-stabilize the soil that has lost its fertility due to the excessive use of chemical fertilizers and to keep the nutrients such as nitrogen, phosphorus and potassium in balance and to give the soil a C: N ratio of not more than 20.

Bio Manure - Speciality

It is a highly natural fermented, ready-to-use fertilizer with organic matter.
Availability of organic carbon, nitrogen, phosphorus, potassium and micronutrients required for the crop.
Moisture percentage balance in the fertilizer.

Product - Advantages

Apart from nutrients like nitrogen, potash and phosphorus, the crop also gets micronutrients like calcium, magnesium, boron, zinc and manganese.
The use of chemical fertilizers like urea, DAP, potash will be reduced.
Increases crop resistance to pests. Therefore the cost of pesticides is greatly reduced.
Using our fertilizer will use less water for the crop and save water.
Soil erosion is less due to the adhesive substances in our manure holding the soil.
Increases the number of microorganisms that fertilize the soil, Thus the earth receives organic carbon.